All Workers Fedaration in India

All Workers Fedaration in India ALL WORKERS ISSUES

జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో మార్కెట్ యార్డు సివిల్ సప్లయి గోడవనుకి ఎదురుగా రోడ్డు పక్కన ఎవరు అనుమతులిచ్చారో తెల...
31/05/2020

జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో మార్కెట్ యార్డు సివిల్ సప్లయి గోడవనుకి ఎదురుగా రోడ్డు పక్కన ఎవరు అనుమతులిచ్చారో తెలవదు కాని ఆర్ & బి వారిదో,కాల్వల కోసం మున్సిపల్ వారిదో,లేక రెవెన్యూ స్థలమో తెలవదు కాని నిర్మాణాలను బాహాటంగా నిర్మిస్తున్నట్లు కొంతమంది తెలియజేస్తున్నారు.వెంటనే సంబదిత అధికారులు పరిశీలించి వాస్తవాలను తేల్చి అక్రమ నిర్మాణం అయితే ఆపివేయాలని పలువురు కోరుతున్నారు.

అమరావతికి నిధులెలా? రాజధానికి అప్పులే దిక్కా!౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼★మోడీ సర్కారు బాధ్యత ఎంత?★ఆంధ్రప్రదేశ్‌ రాజధా...
22/07/2019

అమరావతికి నిధులెలా? రాజధానికి అప్పులే దిక్కా!
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
★మోడీ సర్కారు బాధ్యత ఎంత?

★ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణమెలా?

★ఆంధ్రులకు రాజధాని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?

★ 300 మిలియన్‌ డాలర్లు (దాదాపుగా 2,066 కోట్ల రూపాయలు) రుణానికి ప్రపంచబ్యాంకు నో అనడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది!

★రాజధాని నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకో లేకపోతే మరో ఆర్థిక సంస్థ వద్దకో వెళ్లి అప్పుకోసం చేతులు చాపాల్సిందేనా? మరో మార్గం లేదా?

★ప్రత్యేకహోదా విషయంలో ఏదో ఒకటి మాట్లాడుతున్న మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో ఎందుకు పెదవి విప్పడం లేదు.

★అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు అమరావతి విషయంలో మోడీ సర్కారును ఎందుకు బోనులో నిలబెట్టడం లేదు?
http://www.prajasakti.com/Article/AndhraPradesh/2156883

05/06/2019

ఏపి ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆశాలకి రూ 3వేల నుండి రూ 10వేలు మరియు మద్యాహ్న భోజన కార్మికులకు వెయ్యి రూపాయల నుండి 3వేల రూపాయల వరకు వేతనాని పెంచుతూ ప్రకటనలు చేసినందుకు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు.అంటే వీరి జీతం పెంపు 2 నుండి 3 రెట్లుగా జీతం పెంచారు.

అదేవిధంగా అంగన్ వాడీలకు,విఆర్ఏలకు,ఐకేపి,మెప్మా,హోంగార్డులకు,అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మరియు రోజువారీ కార్మికులకు,పారితోషికాలు తీసుకుంటున్న కార్మికులకు,ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వివిధ రకాల కార్మికులందరికి వారి,వారి జీతాని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 3 రేట్లుగా పెంచి వారి కుటుంబాలలో వెలుగులను నింపితే బాగుంటుందని నా అభిప్రాయం...మెటికల.శ్రీనివాసరావు...
మీరేమంటారు..

25/04/2019

మే నెల నుండి మెాడీ ప్రభుత్వం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు ఆపుతున్నట్లు ప్రకటనలు వస్తున్నాయి.

అదే మాదిరిగా ప్రతి ఆదివారం ప్రతి కర్మాగాలను ఆపి కాలుష్యాని నివారించవచ్చు కదా!!

అదే విధంగా మాంసం,మద్యం విక్రయాలను ఆపవచ్చు కదా!!

వివిధ గుడులకు వెళ్ళుతున్న వారు భక్తితో ప్రతి ఒక్కరు ఒక్క మెుక్కను నాట వచ్చు కదా!

సెల్ యెుక్క వినియెాగం ఆపవచ్చు కదా!!

ప్రతి ఒక్కరు ఏదో అంశంపై చర్చ జరపవచ్చు కదా!

ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవచ్చు కదా!!

ఏమంటారు మిత్రులారా.....

18/03/2019
ఆకాశంలో సగం! కానీ !!  వేతనాల్లో మాత్రం కాదు.* భారత్‌లో మహిళలకు 19% తక్కువగా జీతాలు* దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే తీరు* మా...
08/03/2019

ఆకాశంలో సగం! కానీ !! వేతనాల్లో మాత్రం కాదు.
* భారత్‌లో మహిళలకు 19% తక్కువగా జీతాలు
* దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే తీరు
* మాన్‌స్టర్‌ తాజా వేతన సూచీలో వెల్లడి
😢 పని ప్రదేశాల్లో ఇప్పటికీ అతివలపై వివక్ష
* కీలకమైన ఐటీ, ఐటీ ఆధార సేవా రంగాల్లో 26%
* తయారీ రంగంలో 24% ఎక్కువగా పురుషుల వేతనాలున్నాయి
* మహిళా ఉద్యోగులు అధికంగా ఉండే ఆరోగ్య సేవలు, కేరింగ్‌ సర్వీసులు, సామాజిక సేవా రంగాల్లోనూ మగవారి వేతనాలు 21% ఎక్కువ

07/11/2018
03/11/2018

ప్రశ్న: ఆధునిక విజ్ఞానం అనే మాయలో పడి మనం మన సంస్కృతిని కోల్పోవడం, కాలుష్యాన్ని పెంచడం ఎంతవరకు న్యాయం?
- బి.ఆనంద్‌

జవాబు :ఆధునిక విజ్ఞానం ఓ మాయ కాదు. అది ప్రపంచ వ్యాప్తంగా శ్రామికులు, మేధావులు, ప్రజా సమూహం సమిష్టిగా సాధించుకున్న అద్భుత విజ్ఞాన భాండాగారం. ఆధునిక విజ్ఞానం లేనిదే ఈరోజు ఈ సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, విజ్ఞాన విషయాల పరంపర, నివాస వ్యవస్థ, విద్యావ్యవస్థ, ఆహార సంపద ఉండేవి కావు. నేడు ప్రపంచ వ్యాప్తంగా మానవుడి సగటు ఆయుర్ధాయం సుమారు 70 సంవత్సరాలు. భారతదేశపు సగటు ఆయుర్ధాయం సుమారు 65 సంవత్సరాలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి (సుమారు 70 సంవత్సరాల క్రితం) భారతదేశ సగటు ఆయుర్ధాయం 40 సంవత్సరాలు. 1900లో ప్రపంచ సగటు ఆయుర్ధాయం 33 సంవత్సరాలు కాగా, అది భారతదేశంలో 25 సంవత్సరాలుగా ఉండేది. ఎన్నో వ్యాధుల బారిన పడి, వాతావరణ ప్రమాదాలు, ప్రక తి వైపరీత్యాల పాలనబడి మనుషులు చిరు ప్రాయంలోనే చనిపోయేవారు. అద్భుత ఆరోగ్య వ్యవస్థ, స్త్రీ- గర్భిణీ- ప్రసవ వ్యవస్థ లేని రోజుల్లో మంత్రసానుల చేత ప్రసవం వల్ల శిశువులు ప్రతి వంద ప్రసవాల్లో సుమారు 50 శిశువులు ప్రసవ సమయంలోనే కాలం చేసేవారు. ఎన్నో అంటువ్యాధుల్నుంచి మానవాళిని పరిరక్షించిన టీకాలు, వ్యాధి నిర్థారణ, నివారణ, శస్త్రచికిత్స పద్ధతులు రావడంవల్ల మానవుడు ఈ రోజు 70 సంవత్సరాల వరకు జీవించగలుగుతున్నాడంటే అందుకు కారణం ప్రాచీన పరిజ్ఞానం కాదు. ఆధునిక విజ్ఞానమే కారణం. అంతేకాదు పాదార్థిక పరిజ్ఞానం బోధపడింది. ఇన్ని రకాల పదార్థాలెందుకున్నాయి? ఎలా ఉన్నాయి? జీవం అంటే అర్థం ఏమిటి? మనుషులెలా పుడతారు? జీవకణంలో ఏమున్నాయి? భూమిపై ఇన్ని రకాల జీవులెలా ఆవిర్భవించాయి? వర్షాలు ఎపుడొస్తాయి? తుఫానులు ఎపుడొస్తాయి? సముద్రాల్లోంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎలా సాధించాలి? సుముద్రాల లోతెంత? పర్వతాల ఎత్తు ఎంత? ఆకాశంలో ఏముంది? తోక చుక్కలు, ఉల్కలు, విన్యాసాలు వంటి ఖగోళ సంబంధ సంఘటనలు ఎందుకు, ఎపుడు, ఎలా ఏర్పడతాయి? విశ్వాంతరాళాల రహస్యాలు ఏమిటి? భూమ్మీదతో పాటు మరో గ్రహాలపైన ఎక్కడ జీవం ఉంది? అసలు మరెక్కడైనా జీవం ఉందా? అణువులు, పరమాణువులు, ప్రాథమిక కణాలు, క్వార్కులు, లెప్టానులు, బోసానుల స్థాయి నుంచి తారామండలాలు, నెబ్యులాలు, గురుత్వ తరంగాలు, విద్యుత్తరంగాలు వంటి ఎన్నో వాస్తవాలు తెలుసుకోవడంలో ఆధునిక విజ్ఞానం విజయం సాధించింది.
సంస్కృతి అంటే ఏమిటి? అది కేవలం వర్గ ధోరణి ఉన్న అంశం. ఎవరి సంస్కృతి? గ్రామీణ సంస్కృతి, శ్రామికుల సంస్కృతి, పాలకవర్గాల సంస్కృతి, దోపిడీ వర్గాల సంస్కృతి, రాచరిక సంస్కృతి, భూస్వామ్య సంస్కృతి, ఇలా రకరకాల సంస్కృతులు ఉన్నాయి. భారతదేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగాను సంస్కృతులు ఒకే తీరుగా లేవు. కానీ అధునిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం సంస్కృతులతో ప్రమేయం లేకుండా సార్వత్రికంగా ఒకే నియమ నిబంధనలతో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాచీన సంస్కృతి లో ఆరోగ్యకర ధోరణుల కన్నా వివక్షతతో కూడుకున్న అశాస్త్రీయ ధోరణులు ఎక్కువ. స్త్రీల పట్ల వివక్షత, అణగారిన కులాల పట్ల చిన్నచూపు, ప్రకృతి దృగ్విషయాల పట్ల నిర్హేతుక వివరణలు ఎక్కువ.
అలాగని ప్రాచీన సంస్కృతుల్లో సార్వత్రికత లేదనిగానీ, ఆమోదిత అంశాలు ఏ కోశానా లేవనీ కాదు. అటువంటి సదాచారాల్ని, మానవీయ కోణాల్ని మానవ చరిత్ర తనలో ఇముడ్చుకొంటూ ముందుకెళుతోంది. అనాచారాల్ని వదిలేయమంటోంది. ఆడవాళ్లు, మగవాళ్ల కంటే ఏమీ తీసిపోరనీ, ఎందులోనూ అబలలు కాదని ఘోషిస్తోంది. కుల, మత వైషమ్యాల్లో అర్థం లేదంటోంది. భర్త చనిపోతే భార్యలు కూడా చనిపోవాలనడం, రుతుస్రావం అంటే మైల పడడంగా ఆపాదించడం అనాగరికత అంటోంది. దళితులు పంచమ వర్ణాలని, చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం మనుషులు పుట్టారనడం అమానుషం అంటోంది.
పర్యావరణ కాలుష్యానికి కారణం ఆధునిక విజ్ఞానం కాదు. ఆధునిక సాంకేతికత కాదు. ఆధునిక విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం లాభాలకు శ్రామిక శ్రమశక్తి దోపిడీకి మాత్రమే వాడుకుంటూ అవే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెలిబుచ్చిన పర్యావరణ పరిరక్షణ పద్ధతుల్ని పాటించని పాలకవర్గాలు, పెట్టుబడిదారుల కపట పాలసీలు, పద్ధతులే కాలుష్య కారకాలనీ తెలుసుకోవాలి.

Copying
Metikala Srinivasarao
Sri Sree Ram Agency
Jaggayyapet

విషాదాన్ని మిగిల్చిన ఆగస్టుఈనెలలో కన్నుమూసిన ప్రముఖులు వీరే! రెండు దశాబ్దల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆగస్టు యావత...
30/08/2018

విషాదాన్ని మిగిల్చిన ఆగస్టు

ఈనెలలో కన్నుమూసిన ప్రముఖులు వీరే!

రెండు దశాబ్దల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆగస్టు యావత్‌ దేశానికే విషాదాన్ని మిగిల్చింది. రాజకీయ, సినీ, క్రీడా, సాహితీ ప్రముఖులు కొందరు ఈ నెలలోనే కన్నుమూశారు. ఆగస్టులో పరమపదించిన ప్రతి ఒక్కరూ వారివారి రంగాల్లో చెరగని ముద్ర వేసుకున్న వాళ్లే. ఈ నెల మొదట్లో మనకు దూరమైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి ఈరోజు కన్నుమూసిన తెదేపా సీనియర్‌ నేత, నటుడు నందమూరి హరికృష్ణ వరకూ వారివారి ప్రాంతాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వారే.

* కరుణానిధి: ద్రవిడ రాజకీయాల్లో మేరునగధీరుడిగా ప్రసిద్ధికెక్కిన డీఎంకే అధినేత ముత్తువేల్‌ కరుణానిధి ఆగస్టు 7న కన్నుమూశారు. సుమారు 50ఏళ్లపాటు డీఎంకే అధినేతగా కొనసాగిన ఆయన 94ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

* అనంత్‌ బజాజ్‌: బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌‌ ఛైర్మన్‌ శేఖర్‌ బజాజ్‌ కుమారుడు, సంస్థ ఎండీ అనంత్‌ బజాజ్‌ 41 ఏళ్లకే కన్నుమూశారు. తీవ్రగుండెపోటు రావడంతో ఆయన 2018 ఆగస్టు 10న మరణించారు. 1999లో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనంత్‌.. కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టేవరకూ ఎదిగారు.

* వీఎస్‌ నైపాల్‌: నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత వీఎస్‌ నైపాల్‌ కూడా 85ఏళ్ల ఆగస్టు 12న కన్నుమూశారు. భారత సంతతికి చెందిన నైపాల్‌ పూర్తిపేరు విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌. ఆయనకు 2001లో నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. ఈయన ‘ఎ బెండ్‌ ఇన్‌ ది రివర్‌’,‘ ది ఎంజిమా ఆఫ్‌ ఎరైవల్‌’,‘ఫైండింగ్‌ ది సెంటర్‌’ వంటి పుస్తకాలు రచించారు.

* సోమ్‌నాథ్‌ ఛటర్జీ: దేశ రాజకీయాల్లో యోధుడిగా.. ‘కమ్యూనిస్ట్‌ భద్రలోక్‌’గా.. గొప్ప పార్లమెంటేరియన్‌గా.. కీర్తి ప్రతిష్ఠలు పొందిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ కూడా ఈ నెల 13న కన్నుమూశారు.10 సార్లు ఎంపీగా లోక్‌ సభ సభ్యుడిగా ఈయన పనిచేశారు. 1929 జులై 25న జన్మించిన ఈయన 2018ఆగస్టు 13న కన్నుమూశారు.

* అజిత్‌ వాడేకర్‌: భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ ఈనెల 15న కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో 77ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. క్రీడా రంగంలో ఆయన ప్రతిభకు గాను భారత ప్రభుత్వం 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీలతో గౌరవించింది. సీకే నాయుడు జీవిత సాఫల్యపురస్కారం కూడా అజిత్‌ వాడేకర్‌ అందుకున్నారు.

* అటల్‌ బిహార్‌ వాజ్‌పేయీ: కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఆగస్టు 16న కన్నుమూశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది.

* కోఫీ అన్నన్‌: ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్‌ ఇదే నెల 18న కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన స్విట్జర్లాండ్‌లోని ఆసుపత్రిలో 80ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు అన్నన్‌. 2001లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది.

* చెన్నుపాటి విద్య: తండ్రి భావాలను పుణికి పుచ్చుకుని వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం లక్ష్యాలుగా మహిళాభ్యుదయానికి, పిల్లల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన చెన్నుపాటి విద్య మనకు దూరమైంది కూడా ఇదేనెలలో. ఆగస్టు 18న ఈమె విజయవాడలోని తన నివాసంలో కన్నుమూశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండుసార్లు విజయవాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తే విద్య.

* కుల్‌దీప్ నయ్యర్‌: మేధో దిగ్గజం, ప్రముఖ జర్నలిస్ట్‌, బ్రిటన్‌ మాజీ హైకమిషనర్‌ కులదీప్‌ నయ్యర్‌ ఈనెల 23న మరణించారు. 95ఏళ్ల నయ్యర్‌ అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నయ్యర్‌ ‘బియాండ్ ‌ద లైన్స్’, ‘ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ’ సహా తదితర ఎన్నో ప్రముఖ రచనలు చేశారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు వరకు ప్రముఖ తెలుగు దిన పత్రికల్లో వ్యాసాలు రాశారు.

* నందమూరి హరికృష్ణ: తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత, ఎన్టీఆర్‌ నాలుగో కుమారుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఎన్టీఆర్‌ ప్రచార వాహనం చైతన్య రథ సారథి అయిన హరికృష్ణ 1996 నుంచి 99వరకు ఎమ్మెల్యేగా, పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1996లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన ఈయన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. 2008లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన తర్వాత పార్లమెంటులో తెలుగు గళాన్ని గట్టిగా వినిపించిన హరికృష్ణ తెలుగు భాషా దినోత్సవం రోజే కన్ను మూయడం బాధాకరం

Address

Krishna
521175

Website

Alerts

Be the first to know and let us send you an email when All Workers Fedaration in India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share