Manavu e-Family Counseling Services

Manavu e-Family Counseling Services Manavu e- Family Counseling services,(Maddigunta NarasimhaRao Advocate)
H.no. 15-11-386,V.D.O,s Colony, Khammam A.P, Email:[email protected].

It is an online Family Counseling Services provider . It has been established under the among one of the main aims of Surya Savarnika Manavu Ashramam i.e the concept of the Indian Family System should be protected. In present days so many families are suffering from disturbances due to lack of tolerance and failure of identify the actual causes of domestic problems . In these situations making a

wareness among disturbed family members about their real causes is the only way to resolve their disputes.For these we are conducting Individual and Group counselings through Skype or Video Counseling system . For more details click on message button of this page or see our website, www.ssmanavu.in


ఇంటి సమస్యలను రాజకీయ నాయకుల ద్వారో , పోలిస్ వారి ద్వారో పరిష్కారానికి ప్రయత్నించడం వలన గోటి తో పోయే విషయం గొడ్డలి దాక వెళ్లి చివరకు బందాలను తెంచుతుంది . దాని వలన ఇల్లు నరకంగా మారి , ఇంట్లో ని పిల్లలు , వృద్దులు నరక యాతన అనుభవిస్తారు . మరి ఇటువంటి వాటికి తగిన పరిష్కారం చూపగలిగేవి పామీలి కౌన్సెలింగ్ సెంటర్ లు మాత్రమే . చిన్న చిన్న విషయాలకు ప్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ లకు వెళ్ళడం అందరికి కుదరక పోవచ్చు . అటువంటి వారికి మా e ప్యామిలీ కౌన్సెలింగ్ పేజీ సహాయ పడుతుందని బావించి దీనిని ప్రాంబించడమ్ జరిగింది . ఒక వేళ సమస్య తీవ్రంగా ఉంటె దానికి కూడా ఏ విదంగా చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వడం జరుగుతుంది . అంతే కాక అవసరాన్ని బట్టి గ్రూప్ కౌన్సిలింగ్ లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ లు ఇవ్వడం జరుగుతుంది . వీటి కోసం మనవు ఆశ్రమం తగిన కార్యక్రమాలు రూపొందించి వీటన్నింటిని మన సంప్రదాయ నానుడి అయిన "కుటుంభో రక్షితో రక్షితః " అనే నినాదంతో ముందుకు తీసుకు వెళ్లాలని మా ఆశయం. అందులో బాగమే ఈ "e ప్యామిలీ కౌన్సెలింగ్". ఏర్పాటు . మీ కుటుంబ సమస్యల పై సలహాల కోసం message లింక్ మీద క్లిక్ చేయవలెను . ఆ తర్వాత మీ సమస్యను క్లుప్తంగా మాకు పంపిన" యెడల , దానికి తగిన న్యాయ సలహాలు ఇవ్వబడతాయి . ఈ పేజీ కేవలం కుటుంబ పరమైన అన్నీ సలహాలు అనగా వివాహాం , భార్యా భర్తల సమస్యలు, గృహ హింస , మైనర్ పిల్లల పోషణ , వృద్దుల పోషణ, కుటుంబ ఆస్తులు తదితర విషయాలకు సంబందించి మాత్రమే సలహాలు ఇవ్వబడును . కుటుంబ బాదితులు , వారి తరపు వారు ఎవరైనా మా ఫ్యామిలి కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చు. మా సలహాలు మీ సమస్యలు తీర్చడంలో ఉపయోగపడితే , మాకు తెల్పిన యెడల , పలితాలను సమీక్షించి భవిష్యత్ లో మరింత మెరుగైన సేవలు అందించుటకు వీలగును. ఆన్ లైన్ లో ప్యామిలీ కౌన్సిలింగ్ సేవలు అందించడం అనేది పూర్తిగా వ్యక్తిగతంగానే జరుగుతుంటాయి కాబట్టి కుటుంబ సమస్యలను పబ్లిక్ లో కుటుంబ మర్యాదకు బంగం కలుగదు . పైపెచ్చు కుటుంబ ప్రైవసీ ని ఇది పూర్తిగా కాపాడేటట్లు ఆన్లైన్(vidEo) ప్యామిలీ కౌన్సిలింగ్ పద్దతి ఉంటుంది

ఈ మధ్య పాతిక,ముప్పై ఏండ్లు కాపురం చేసిన జంటలు కూడా విడాకులు తీసుకోవడం లో వెనుకడుగు వేయడం లేదు. కారణం సమాజం లో విరివిగా ల...
23/11/2024

ఈ మధ్య పాతిక,ముప్పై ఏండ్లు కాపురం చేసిన జంటలు కూడా విడాకులు తీసుకోవడం లో వెనుకడుగు వేయడం లేదు. కారణం సమాజం లో విరివిగా లభిస్తున్న స్వేచ్చా ఫలాలు లేట్ గానైన ఎందుకు అందుకోకూడదు అనే ఆలోచన పెరుగుతుండడం కావచ్చు.వీరి స్వయంకృత మలి జీవితం ఎలా ఉన్నా, విది వశాత్తు ఒంటరి అయినవారి జీవితం మాత్రం దుర్భరంగా నే ఉంటుంది. ప్రేమాభిమానాలు ఉన్న పిల్లలు ఉన్నా,వారికుండే
పనులు బిజీ వల్ల తల్లి తండ్రులు తో గడపడానికి తగిన సమయం కేటాయించే పరిస్థితులు లేకపోవచ్చు.అలాంటి సందర్భాల్లో మలి వయసు లోఒక తోడు కావాలి అనిపిస్తుంది.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే,ఇలా మలి వయసులో తోడు కోరుకునే వారికి వివాహం అనే ప్రక్రియ అవసరమా?పెండ్లి లేకుండా సహజీవనం చేయలేరా? వయసులో ఉండి, పిల్లల్ని కనగలిగిన వారెమో పెండ్లి అనేది లేకుండా, సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నారు.వయస్సు మళ్ళిన వారు,కుటుంబ బాధ్యతలు లేనివారు విడాకులు లేదా విదివశాత్తూ ఒంటరిగా మారితే మళ్ళీ పెండ్లి గురించి ఆలోచన చేయడమంటే ఇదొక సోషల్ డిజార్డర్ నెస్ అనొచ్చు.అంటే 20 లో చేయాల్సిన పనిని,అరవైలో,అరవై లో చేయాల్సిన పనిని ఇరవై లో చేయడం లాంటిది.
సాధారణంగా తల్లి లేక తండ్రి రెండవ పెండ్లి చేసుకోవడానికి మేజర్ అయిన పిల్లలు ఎక్కువమంది అంగీకరించరు.కారణం తమ తల్లి లేక తండ్రి స్తానం మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడక పోవడం,ఆస్తుల పంపకం విషయం లో కలిగే భేదాభిప్రాయాలు కారణాలుగా ఉంటాయి.కాబట్టి వీటన్నింటికి చక్కటి పరిష్కారం సహజీవనం. కుటుంబ సభ్యులు కూడా అంగీకరించే స్నేహపూర్వక సామాజిక జీవిత ఒప్పందం..
కాబట్టి యవ్వనం లో తోడు కోరుకునే వారు వివాహం చేసుకుని కుటుంబ అభిరుద్దికి తోడ్పడడం, అన్ని అయిపోయి,మలి వయసులో తోడు కావలసిన వారు సహజీవనం ద్వారా కుటంభం విచ్చినం కాకుండా చూసుకోవడం మంచిది.ఈ విధానం ని మ్యారేజ్ బ్యూరో లు,ఇతర సంస్థలు కౌన్సిలింగ్ ద్వారా పిల్లల్ని,పెద్దల్ని ఒప్పిస్తే, సమాజం లో అన్ని వయసుల వారికి కుటుంబ భద్రత ఉంటుంది.

17 యేండ్లు కని పెంచిన తల్లి తండ్రులు విలన్ లు లాగా కనిపించి ఉంటారు ఆ పిచ్చి తల్లి కి.ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై "లేచి పోదా...
19/11/2024

17 యేండ్లు కని పెంచిన తల్లి తండ్రులు విలన్ లు లాగా కనిపించి ఉంటారు ఆ పిచ్చి తల్లి కి.ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై "లేచి పోదాం రా" అన్నోడు హీరో లాగా అనిపించాడు.అంతే!జంప్!వాడేమో బకరా దొరికిందని ఆనందంగా ఫ్రెండ్ ఇంటికి తీసుకు వెళ్లి పండుగ చేసుకున్నాడు.అమ్మాయేమో ఇక పెండ్లి చేసుకుందామా అని అమాయకంగా ఆడిగేసరికి ,కంగు తిన్న పోరగాడు కామ్ అయ్యేసరికి,అమ్మాయి ఒత్తిడి చేసింది.అంతే!నమ్మి వచ్చిన ప్రియురాలిని తల గోడకు వేసి బాది, కపాల మోక్షం కలిగించాడు.గుట్టు చప్పుడు కాకుండా వాడుకున్న బాడీని స్నేహితుల సహాయం తో వదిలించుకున్నాడు.ఆ తర్వాత పోలీసులు కేసులు మాములే.
ఇది నేటి సమాజం లో కుటుంబ కట్టుబాట్లు కాదని,స్వేచ్ఛ,ప్రేమ అనే అపోహ తో మోహం లో చిక్కుకుని బయటకు వెళ్లి,సర్వం కోల్పోయి చివరకు అనాధ శవాలు లా మారుతున్న ఆడపిల్లల పరిస్థితి.

ఈ కేసులో బాంబే హై కోర్టు వారు ఇచ్చిన తీర్పు చూస్తుంటే,"బొబ్బిలి పులి" అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక డైలా...
10/11/2024

ఈ కేసులో బాంబే హై కోర్టు వారు ఇచ్చిన తీర్పు చూస్తుంటే,"బొబ్బిలి పులి" అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది" కోర్టు కోర్టు కి ఇచ్చే తీర్పు తీర్పు లో ఇంత మార్పు ఉంటే ,మీ న్యాయస్థానాల్లో న్యాయం ఉన్నట్టా,యువరానర్ "అని.
ఒక ఇంట్లో కోడలిని ,రోజూ అర్ధరాత్రి లేపి,నల్లా నీళ్లు పట్టమని అత్తింటి వారు వేధించే వారట. ఇంకా TV చూడొద్దు.చాప మీద పడుకో అని కూడా అంటుంటే,ఆ అమ్మాయి వాటిని వేధింపులుగా భావించి ఆత్మహత్య చేసుకుంటే,క్రింది కోర్టువారు వాటిని క్రూరత్వ చర్యలుగా నిర్దారించి,అత్తింటి వారికి 20 ఏండ్ల జైలు శిక్ష వేస్తే, వారు హై కోర్టులో అప్పీల్ చేస్తే, వారుండే ఏరియా లోఅర్ధరాత్రి ఒంటిగంటకు నల్లా నీరు వస్తుంది కాబట్టి,కేవలం కోడలు మాత్రమే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆ టైం లో లేచి నీరు పట్టేవారని రుజువు అయినందువల్ల,అటువంటి నిత్య గృహ చర్యలును క్రూరత్వం అనలేమని,అత్తింటి వారు కోడలిని హింసించినట్లు ఏ ఆధారాలు లేవని తేల్చి కేసును కొట్టేశారు.
అంటే పై కేసులో క్రింది కోర్టు వారు,సాక్ష్యాధారాలు పరిశీలించి,నేరం జరిగిందని 20 ఏండ్ల శిక్ష వేయదగిన నేరం అని బావించినప్పుడు,అప్పీల్ కోర్టు వారు శిక్షను తగ్గించాలి తప్ప,అసలు నేరం జరిగిందని చెప్పే అంశాలు ఏవి క్రూరత్వం క్రిందకు రావు అని,కేసుని ఆసాంతం కొట్టివేస్తే,ప్రజలు కు క్రింది స్థాయి న్యాయస్థానాలు మీద ఎలా నమ్మకం ఉంటుంది?రేపు సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తే, ఒక 10 ఏండ్ల తర్వాత వారు మరొక తీర్పు ఇస్తే.....కాబట్టి ,మన న్యాయ వ్యవస్థ లో చాలా మార్పులు రావలసిన అవసరం ఉంది. అందులో ఒకటి మరణ శిక్షలు కేసులో మాదిరి ,7 సంవత్సరాలు పై బడిన శిక్షలు కు సంబంధించిన తీర్పులు అన్నింటిని కూడా హై కోర్టు వారి అప్రూవల్ తోనే క్రింది కోర్టులు ప్రకటిస్తే,ప్రజలలో న్యాయ వ్యవస్థ ప్రక్రియలు పట్ల నమ్మకం ఉంటుంది.

"తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవ గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమా! "అని...
08/11/2024

"తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవ గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమా! "
అని వేమన గారు చెప్పిన పద్యం ని మనం చిన్నప్పుడు బడిలో ఎన్నోసార్లు వల్లెవేసాం.దీని భావమేమి అంటే
తల్లిదండ్రులపైన దయ తో ఉండాలి. వృద్ధాప్యం లో వారిని దయతో ప్రేమతో ఆదరించాలి. అలా చేయని కొడుకు ఉన్న లేనట్టే అని.కానీ కొంతమంది కొడుకులకు పెద్దయ్యాక దీనిని మర్చి పోయి,కన్నవారి పట్ల కనికరం చూపక పోగా ,వారి పేరు మీద ఉన్న భూమిని తమ పేరు మీద రాయించుకుని,ఆపై కర్కశంగా కొట్టి,ఇంట్లో నుంచి వెల్లగొడితే, ఏమి జరుగుతుందో చక్కగా తెలియచేసే సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. సంబంధిత RDO గారి ఆర్డర్ తో తహసీల్దార్ గారు భూమి పట్టాను రద్దు చేసి, తిరిగి తండ్రికి భూమిని బదలాయించి,ఆ కొడుక్కి బుద్ది చెప్పిన సంఘటన ఇది.
తల్లి తండ్రులు దగ్గర నున్న భూమిని తీయటి మాటలతో,ప్రేమలు నటిస్తూ,తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని,ఆ తర్వాత వారు చేసేది ఏమి లేదులే అని ఆలనా పాలనా చూడని పిల్లలకు సీనియర్ సిటిజన్ ఆక్ట్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది.సదరు నిరాదరణకు గురైన తల్లితండ్రులు,RDO గారికి పిటిషన్ పెడితే,పిల్లలు పేరు మీద రిజిస్టర్ అయినా సరే ఆ రిజిస్టర్ పట్టాను క్యాన్సిల్ చేసి,తిరిగి పేరెంట్స్ కి ఆస్తులును బదలాయించి వాటిపై హక్కులు కలుగ చేసే అధికారం RDO లకు సీనియర్ సిటిజన్ ఆక్ట్ కలగ చేసింది.కాబట్టి పుట్టలో చెదలు లాంటి కొడుకులు జాగ్రత్త.

20 సంవత్సరాలు పైగా పెండింగ్ లో ఉన్న అంశం"ప్రైవేట్ ఆస్తులును  ఉమ్మడి సామాజిక వనరుగా పరిగణించవచ్చా?లేదా?".అనే దానిపై నిన్న...
06/11/2024

20 సంవత్సరాలు పైగా పెండింగ్ లో ఉన్న అంశం"ప్రైవేట్ ఆస్తులును ఉమ్మడి సామాజిక వనరుగా పరిగణించవచ్చా?లేదా?".అనే దానిపై నిన్న భారత అత్యున్నత న్యాయస్థానం తరపున రాజ్యాంగ ధర్మాసనం 8:1మెజార్టీ తో వెలువరించిన తీర్పు న్యాయ చరిత్రలో మైలురాయి అని చెప్పవచ్చు.
సామాజిక అవసరాల కంటే వ్యక్తిగత కక్షలకు ప్రాధాన్యత ఇస్తూ,రాజకీయ పార్టీల పరస్పర ప్రతీకార చర్యల కోసం,సామాజిక అవసరాల పేరుతో ,అధికార గర్వంతో,చట్ట ప్రక్రియలను తుంగలో త్రొక్కి,రాజకీయ బుల్డోజర్ లతో ప్రైవేట్ ఆస్తులను ద్వoసం చేస్తూ,అదేదో పెద్ద హీరో ఇజం లాగా ఫీల్ అవుతున్న,రాజకీయ నాయకులకు,వారి ప్రేరేపిత అధికారులకు ఇది చెంప పెట్టు లాంటి తీర్పు.
ఈ తీర్పు ప్రకారం , ప్రభుత్వాలు సామాజిక అవసరాలు పేరుతో ఏ ప్రైవేట్ ఆస్తిని నిర్బంధంగా స్వాధీనం చేసుకోకూడదు.కేవలం నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన అట్టి స్వాధీనం చెల్లుబాటు కాదు.చట్ట ప్రక్రియలు,పద్ధతులు కూడా తు. చ. తప్పకుండా పాటించాలి. ఆ ప్రత్యేక ప్రతిపాదిత ప్రైవేట్ ఆస్తి దేనికోసం లేక ఎందుకు సామాజిక అవసరం అయింది?అనేది వివరంగా తెలియ చేస్తూ,సంబంధిత యజమానికి తగిన గడువు తో నోటీస్ ఇవ్వాలి.ఆ తర్వాత యజమాని అభ్యంతరాలు,ఆక్షేపణలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే చట్టపరంగా ఉత్తర్వులు జారీ చేయాలి.అట్టి ఉత్తర్వులను యజమాని కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తే,సదరు కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ,ప్రభుత్వాలు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.అంతే తప్ప,అర్ధరాత్రి బుల్డోజర్ల తో అధికారుల ను పంపి,ప్రైవేట్ ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలి అంటే ఇక కుదరని పని.అలాంటి దుందుడుకు పనులు చేసే అధికారులు చట్ట పరం గా ఇక నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఉద్యోగం చేస్తున్న తల్లి లేక తండ్రి చనిపోతే,కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం పొందే హక్కు,పెళ్ళైన కుమారుడికి మాత్రమే కాదు పె...
02/11/2024

ఉద్యోగం చేస్తున్న తల్లి లేక తండ్రి చనిపోతే,కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం పొందే హక్కు,పెళ్ళైన కుమారుడికి మాత్రమే కాదు పెళ్ళైన కూతురికి కూడా ఉంటుంది అని గౌరవనియా ఆంద్రప్రదేశ్ హైకోర్టు వారు ఇటీవల తీర్పు ఇచ్చారు.కాబట్టి కారుణ్య నియామకాల దరఖాస్తులు పరిశీలించే అధికారులు,తాము అనుసరిస్తున్న పాత చట్టాలు వాటి తాలూకు నిబంధనలకు నీళ్లు వదిలి,ప్రస్తుతం అమలు లో ఉన్న వారసత్వ చట్టాలు,వాటి ప్రకారం మగపిల్లలు తో పాటు,ఆడపిల్లలకు కల్పించిన హక్కులను పరిశీలించి,అప్లికేషన్ లను పరిష్కరించాల్సి ఉంటుంది.
ఇక్కడ పెళ్ళైన ఆడపిల్లలు,మగపిల్లలు గుర్తు ఉంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే,పెండ్లి అయినంత మాత్రాన మీ పుట్టింటికి మీరు పరాయివారు కారు.జీవితకాలం కుటుంబ సభ్యులు మీరు.కుటుంబ ఆస్తులు పంచుకుని అనుభవించే హక్కు మాత్రమే కాదు,తల్లితండ్రుల మరియు ఇతర మైనర్ కుటుంబ సభ్యుల బాధ్యతలతో పాటు కుటుంబం తాలూకు అన్ని ఇతర బాధ్యతలు ఏవైనా ఉంటే వాటిని స్వీకరించి నెరవేర్చాల్సి ఉంటుంది.అంటే దీనర్థం సమాన హక్కులు అనేవి సమాన బాధ్యతలతో కూడి ఉంటుంది అని ప్రస్తుత వారసత్వ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.

భార్య కానీ,భర్త కానీ,తమ జీవిత భాగస్వాములను బెదిరించాలనో,లొంగ దీసుకుని కాపురం కొనసాగిద్దామనో అనుకుని,తప్పుడు పోలీస్  కేసు...
03/09/2024

భార్య కానీ,భర్త కానీ,తమ జీవిత భాగస్వాములను బెదిరించాలనో,లొంగ దీసుకుని కాపురం కొనసాగిద్దామనో అనుకుని,తప్పుడు పోలీస్ కేసులు పెడితే ,అది కుదరదు అని అలహాబాద్ హైకోర్టువారు ఇటీవల సెలవిచ్చారు.అట్టి తప్పుడు కంప్లైంట్ చేత బాధితులుగా మారిన వారు,తమ భాగస్వామి తో విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది.అసలు తప్పుడు కంప్లైంట్ ఇచ్చాక,కలసి బ్రతకడం దుర్భరంగా ఉంటుంది అని హైకోర్టు వారు,తీర్పులో చెప్పడం జరిగింది.కాబట్టి జీవిత బాగ స్వామి తో సమస్యలు ఉన్న వారు,విడాకులు కోసం కాకుండా,తమ కాపురం సజావుగా సాగాలని కోరుకునే వారు,ఖచ్చితంగా తమ సమస్యను నిర్భయంగా,నిజాయితీగా,నిజాన్ని కేసులు ద్వారా పెద్దమనుషులు,ఫామిలీ కౌన్సిలర్లు,కోర్టుల దృష్టికి తీసుకు వస్తే, సరి అయిన న్యాయం దొరికే అవకాశం ఉంటుంది అని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది.

26/04/2024

భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు
"కట్నం ఉమ్మడి ఆస్తి రాదు. ఆమెకు సొంతంగా సంక్రమించిన ఆస్తి, నగలు, ధనాన్ని భర్త ఏ అవసరానికి వాడుకోరాదు. వాడుకుంటే తప్పనిసరిగా ఆమెకు తిరిగి ఇవ్వాలి. భార్యకు పెళ్లికి ముందు కానీ , పెళ్లి దశలో కానీ , అప్పగింతలు లేదా ఆ తరువాతి దశల్లో ఏ రూపంలో అయినా పుట్టింటి నుంచి ధనం, ఆస్తి అందితే అది పూర్తిగా భార్యకే చెందుతుంది. భార్య దాన్ని ఇష్టానుసారంగా వాడుకునే అవకాశం ఉంటుంది.. కానీ భర్తకు ఎలాంటి హక్కులు ఉండవు. కష్టాల్లో భర్త వాడుకున్నా మళ్లీ తిరిగి భార్యకకు ఇచ్చేయాలి. వివాహ బంధాలకు సంబంధించిన విషయాలను సూటిగా చెప్పలేం. బంగారాన్ని వాడుకుని తిరిగి ఇవ్వనందుకు భర్త రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి" అని ధర్మాసనం స్పష్టం చేసింది.

02/09/2022

Address

VDO'S COLONY
Khammam
507002

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 8am - 1pm

Telephone

+919399325372

Alerts

Be the first to know and let us send you an email when Manavu e-Family Counseling Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Manavu e-Family Counseling Services:

Share

Our Story

It is an online Family Counseling Services provider . It has been established under the among one of the main aims of Surya Savarnika Manavu Ashramam i.e the concept of the Indian Family System should be protected. In present days so many families are suffering from disturbances due to lack of tolerance and failure of identify the actual causes of domestic problems . In these situations making awareness among disturbed family members about their real causes is the only way to resolve their disputes.For these we are conducting Individual and Group counselings through Skype or Video Counseling system . For more details click on message button of this page or see our website, www.ssmanavu.in ఇంటి సమస్యలను రాజకీయ నాయకుల ద్వారో , పోలిస్ వారి ద్వారో పరిష్కారానికి ప్రయత్నించడం వలన గోటి తో పోయే విషయం గొడ్డలి దాక వెళ్లి చివరకు బందాలను తెంచుతుంది . దాని వలన ఇల్లు నరకంగా మారి , ఇంట్లో ని పిల్లలు , వృద్దులు నరక యాతన అనుభవిస్తారు . మరి ఇటువంటి వాటికి తగిన పరిష్కారం చూపగలిగేవి పామీలి కౌన్సెలింగ్ సెంటర్ లు మాత్రమే . చిన్న చిన్న విషయాలకు ప్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ లకు వెళ్ళడం అందరికి కుదరక పోవచ్చు . అటువంటి వారికి మా e ప్యామిలీ కౌన్సెలింగ్ పేజీ సహాయ పడుతుందని బావించి దీనిని ప్రాంబించడమ్ జరిగింది . ఒక వేళ సమస్య తీవ్రంగా ఉంటె దానికి కూడా ఏ విదంగా చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వడం జరుగుతుంది . అంతే కాక అవసరాన్ని బట్టి గ్రూప్ కౌన్సిలింగ్ లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ లు ఇవ్వడం జరుగుతుంది . వీటి కోసం మనవు ఆశ్రమం తగిన కార్యక్రమాలు రూపొందించి వీటన్నింటిని మన సంప్రదాయ నానుడి అయిన "కుటుంభో రక్షితో రక్షితః " అనే నినాదంతో ముందుకు తీసుకు వెళ్లాలని మా ఆశయం. అందులో బాగమే ఈ "e ప్యామిలీ కౌన్సెలింగ్". ఏర్పాటు . మీ కుటుంబ సమస్యల పై సలహాల కోసం message లింక్ మీద క్లిక్ చేయవలెను . ఆ తర్వాత మీ సమస్యను క్లుప్తంగా మాకు పంపిన" యెడల , దానికి తగిన న్యాయ సలహాలు ఇవ్వబడతాయి . ఈ పేజీ కేవలం కుటుంబ పరమైన అన్నీ సలహాలు అనగా వివాహాం , భార్యా భర్తల సమస్యలు, గృహ హింస , మైనర్ పిల్లల పోషణ , వృద్దుల పోషణ, కుటుంబ ఆస్తులు తదితర విషయాలకు సంబందించి మాత్రమే సలహాలు ఇవ్వబడును . కుటుంబ బాదితులు , వారి తరపు వారు ఎవరైనా మా ఫ్యామిలి కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చు. మా సలహాలు మీ సమస్యలు తీర్చడంలో ఉపయోగపడితే , మాకు తెల్పిన యెడల , పలితాలను సమీక్షించి భవిష్యత్ లో మరింత మెరుగైన సేవలు అందించుటకు వీలగును. ఆన్ లైన్ లో ప్యామిలీ కౌన్సిలింగ్ సేవలు అందించడం అనేది పూర్తిగా వ్యక్తిగతంగానే జరుగుతుంటాయి కాబట్టి కుటుంబ సమస్యలను పబ్లిక్ లో కుటుంబ మర్యాదకు బంగం కలుగదు . పైపెచ్చు కుటుంబ ప్రైవసీ ని ఇది పూర్తిగా కాపాడేటట్లు ఆన్లైన్(vidEo) ప్యామిలీ కౌన్సిలింగ్ పద్దతి ఉంటుంది