GaddamGireesh

GaddamGireesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GaddamGireesh, Legal Service, Hyderabad.

21/02/2026
తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. పోలీసులు ఇకపైన కొరడా జరిపించడానికి ఎటువంటి ఆస్కారం లేదని చెప్పి కింద మ...
16/01/2026

తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది.

పోలీసులు ఇకపైన కొరడా జరిపించడానికి ఎటువంటి ఆస్కారం లేదని చెప్పి కింద మార్గదర్శకాలను జారీ చేసింది.

పోలీస్ అధికారులు పాటించవలసిన మార్గదర్శకాలు..

సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ ప్రసంగాలు, లేదా వ్యక్తిగత పరువు నష్టం (Defamation) వంటి అంశాలపై FIR నమోదు చేయుటకు సంబంధించి క్రింది మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించవలెను:

1. లొకస్ స్టాండీ పరిశీలన
పరువు నష్టం వంటి ఫిర్యాదుల విషయంలో FIR నమోదు చేయకముందు, ఫిర్యాదు చేసిన వ్యక్తి “అగ్రీవ్డ్ పర్సన్” (నేరుగా నష్టం పొందిన వ్యక్తి) అవుతాడో లేదో పోలీసులు నిర్ధారించాలి. సంబంధం లేని మూడో వ్యక్తుల ఫిర్యాదులు నిలబెట్టుకోలేవు. కానీ, కాగ్నిజబుల్ నేరం (గుర్తింపు పొందిన నేరం) అయితే మాత్రం మినహాయింపు ఉంటుంది.

2. ప్రాథమిక విచారణ
ఫిర్యాదు కాగ్నిజబుల్ నేరాన్ని సూచిస్తే, వెంటనే FIR నమోదు చేయకుండా ముందుగా ఒక ప్రాథమిక విచారణ చేసి, ఆ నేరానికి సంబంధించిన చట్టపరమైన అవసరమైన అంశాలు (ingredients) ఉన్నాయో లేదో నిర్ధారించాలి.

3. ప్రసంగం/మీడియా పోస్టులపై కఠిన ప్రమాణం
శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ఉద్దేశపూర్వక అవమానం, ప్రజా శాంతిభంగం, లేదా తిరుగుబాటు (sedition) ఆరోపణలపై FIR నమోదు చేయాలంటే, హింసకు ప్రేరేపించే లేదా ద్వేషం, శాంతిభంగాన్ని కలిగించే పదార్థం ఉన్నదనే ప్రాథమిక ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. (Kedar Nath Singh v. State of Bihar, 1962 మరియు Shreya Singhal v. Union of India, 2015 తీర్పులను అనుసరించాలి).

4. రాజకీయ ప్రసంగ రక్షణ కఠినమైనా, విమర్శాత్మకమైనా, లేదా అవమానకరమైనా రాజకీయ ప్రసంగం మాత్రమే ఉంటే FIR నమోదు చేయరాదు. హింసకు ప్రేరేపిస్తే లేదా ప్రజా శాంతికి తక్షణ ముప్పు కలిగిస్తే తప్ప క్రిమినల్ చట్టం వర్తించదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) క్రింద ఉన్న స్వేచ్ఛా భావ ప్రకటన హక్కు కాపాడబడాలి.

5. పరువు నష్టం నాన్-కాగ్నిజబుల్ నేరం
Defamation (పరువు నష్టం) నేరం నాన్-కాగ్నిజబుల్ కిందకి వస్తుంది. కాబట్టి పోలీసులు నేరుగా FIR నమోదు చేయరాదు. ఫిర్యాదుదారు సంబంధిత మేజిస్ట్రేట్‌ వద్ద ఫిర్యాదు చేయాలి. మేజిస్ట్రేట్‌ సెక్షన్ 174(2), BNSS ప్రకారం ఆదేశం ఇచ్చిన తర్వాతే పోలీసులు చర్యలు చేపట్టాలి.

6. అరెస్ట్ మార్గదర్శకాలు
అన్ని కేసుల్లోనూ పోలీసులు Arnesh Kumar v. State of Bihar (2014) తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. యాంత్రికంగా అరెస్టులు చేయరాదు. క్రిమినల్ ప్రక్రియలో సామాన్య ప్రమాణం (proportionality) పాటించాలి.

7. సున్నితమైన కేసుల్లో లీగల్ అభిప్రాయం
రాజకీయ ప్రసంగం/సోషల్ మీడియా పోస్టుల వంటి సున్నితమైన కేసుల్లో FIR నమోదు చేయకముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి.

8. అసత్య/ప్రేరేపిత ఫిర్యాదులు ఫిర్యాదు అసత్యమైనది, దురుద్దేశపూర్వకమైనది, లేదా రాజకీయ ప్రేరేపితమైనది అని తేలితే, పోలీసులు BNSS సెక్షన్ 176(1) ప్రకారం “తగిన ఆధారాలు లేవు” అని పేర్కొని మూసివేయాలి.

Section 199A.   Offences by juveniles.1[199A. Offences by juveniles.--(1) Where an offence under this Act has been commi...
06/05/2023

Section 199A. Offences by juveniles.
1[199A. Offences by juveniles.--(1) Where an offence under this Act has been committed by a juvenile, the guardian of such juvenile or the owner of the motor vehicle shall be deemed to be guilty of the contravention and shall be liable to be proceeded against and punished accordingly:
Provided that nothing in this sub-section shall render such guardian or owner liable to any punishment provided in this Act, if he proves that the offence was committed without his knowledge or that he exercised all due diligence to prevent the commission of such offence.
Explanation.-- For the purposes of this section, the Court shall presume that the use of the motor vehicle by the juvenile was with the consent of the guardian of such juvenile or the owner of the motor vehicle, as the case may be.
(2) In addition to the penalty under sub-section (1), such guardian or owner shall be punishable with imprisonment for a term which may extend to three years and with a fine of twenty-five thousand rupees.
(3) The provisions of sub-section (1) and sub-section (2) shall not apply to such guardian or owner if the juvenile committing the offence had been granted a learner's licence under section 8 or a driving licence and was operating a motor vehicle which such juvenile was licensed to operate.
(4) Where an offence under this Act has been committed by a juvenile, the registration of the motor vehicle used in the commission of the offence shall be cancelled for a period of twelve months.
(5) Where an offence under this Act has been committed by a juvenile, then, notwithstanding section 4 or section 7, such juvenile shall not be eligible to be granted a driving licence under section 9 or a learner's licence under section 8 until such juvenile has attained the age of twenty-five years.
(6) Where an offence under this Act has been committed by a juvenile, then such juvenile shall be punishable with such fines as provided in the Act while any custodial sentence may be modified as per the provisions of the Juvenile Justice Act, 2000 (56 of 2000).]
199B. Revision of fines.-- The fines as provided in this Act shall be increased by such amount not exceeding ten per cent. in value of the existing fines, on an annual basis on 1st day of April of each year from the date of commencement of the Motor Vehicles (Amendment) Act, 2019(32 of 2018), as may be notified by the Central Government.

💫 GaddamGireesh Advocate ☺️ Hyderabad

07/05/2022

*Limitation Period:*
*1. The time for filing first appeal in civil cases is 30 days. *
*2. The time for filing second appeal in civil cases is 60 days.*
*3. The time for filing civil revision is 90 days.*
*4. Limitation period of appeal in capital punishment, 7 days.*
*5. Limitation period of appeal From Magistrate to Sessions Court, 30 days.*
*6. Limitation period of appeal From Sessions Court to High Court, 60 days.*
*7. Limitation period of appeal From High Court to Supreme Court, 30 days.*
*8. Limitation period of appeal From High Court to Supreme Court in special Leave to Appeal, 30 days.*
*9. Limitation period of appeal From Magistrate to High Court in acquittal in Challan Case is 30 days and in Complaint Case 60 days.*
*10. Limitation period of appeal From Sessions Court to High Court in acquittal in Challan Case is 30 days and in Complaint Case 60 days.*
*11. Limitation period of appeal From High Court when case decide by it in its original jurisdiction and to Division Bench than 20 days in acquittal or conviction as the case may.*
*12. Plaintiff has a time of 6 years to file ex*****on.*
*13. Limitation in civil suits is 3 years from the cause of action.*
*14. Article 150. Appeal from death sentence to High Court-7 days.*
*15. Article 151. High Court order on original side-appeal-20 days.*
*16. Article 154. Appeal to any Court other than High Court-30 days.*
*17. Article 155. Criminal appeal to High Court-60 days.*
*18. Article 157. Appeal from acquittal by State-6 months.*

జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటీ . ? పోలీస్ కస్టడీ ఏ సందర్భంలో ఉంటుందిమన దేశంలో పోలీసు వ్యవస్థ అత్యంత బలంగా ఉంటుంది. పోలీసు ...
03/05/2022

జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటీ . ? పోలీస్ కస్టడీ ఏ సందర్భంలో ఉంటుంది
మన దేశంలో పోలీసు వ్యవస్థ అత్యంత బలంగా ఉంటుంది. పోలీసు వ్యవస్థకు సంబంధించి అనేక రకాల ఆసక్తికర విషయాలు ఉంటాయి. ముఖ్యంగా అరెస్ట్ ప్రక్రియ అనేది చాలా మందికి అవగాహన ఉండదు.అసలు ఏ పద్దతిలో అరెస్ట్ చేస్తారు, ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటీ, సెకండ్ డిగ్రీ అంటే ఏంటీ, థర్డ్ డిగ్రీ అంటే ఏంటీ అనేది చాలా మందికి తెలియని విషయాలు. అలాగే ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ అనేవి కూడా అవగాహన ఉండదు.
ఇక పోలీస్ కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీ అనే విషయాలు కూడా అవగాహన ఉండదు చాలా మందికి. ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసు అధికారి మరింత సమాచారం సేకరించడం కోసం మరియు విచారణ నిమ్మిత్తం అనుమానిత వ్యక్తిని అరెస్టు చేయడాన్ని పోలీస్ కస్టడీ అంటారు. పోలీసు కస్టడీ యొక్క మరొక లక్ష్యం సాక్ష్యాలను నాశనం చేయకుండా కట్టడి చేయడం. చాలా మంది నేరస్థులు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి. పోలీసులు జాగ్రత్త పడుతూ ఉంటారు.

ఇక జ్యుడిషియల్ కస్టడీ విషయానికి వస్తే. అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ అదుపులో ఉంచుకుని జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ కస్టడీ సమయంలో పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ అనుమతి తర్వాత మాత్రమే విచారించాల్సి ఉంటుంది. సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు పూర్తి చేసినందుకు నిందితులను పోలీసుల అదుపులోకి పంపడమే. ప్రస్తుత లేదా భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని ఊహించి సహేతుకమైన కారణాలు ఉన్నప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్య జ్యుడిషియల్ కస్టడీ.

14/03/2022

#ఆస్తిహక్కుసుప్రీంకోర్టుతీర్పు (ఆగస్టు 2020)
*తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు*

*మరియు మహిళల ఆస్తి హక్కు, హిందూ వారసత్వ చట్టం-1956,
హిందూ వారసత్వ(సవరణ)చట్టం-2005 & దావాలు, వాదనలు. తమతమ వాటాల కోసం దావాలు వేసుకోవడం ఎలా!*

*తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు సుప్రీంకోర్టు తీర్పు (ఆగస్టు 2020)*

మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ, వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ(సవరణ) చట్టంలో-2005 ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

2005లో చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి చనిపోతే సోదరులు ఆస్తిలో వాటా నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2005 నాటికి తండ్రి మరణించినా, బతికి ఉన్నా ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆరు నెలల్లో నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది. *(ఆగస్టు 2020)*
# # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #

#మ‌హిళలఆస్తిహ‌క్కు

ప్రాచీన కాలంలో మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కులు ఉండేవి కాదు. హింధూ ధ‌ర్మ‌శాస్ర్తం ప్ర‌కారం స్ర్తీల‌కు బాల్యం, య‌వ్వ‌నం, వృద్ధాప్యంలో పోష‌ణ మాత్ర‌మే ఉండేది. మ‌హిళ‌ల‌కు వ‌చ్చిన కానుక‌లు మాత్ర‌మే స్ర్తీ ధ‌నం అనేవారు. స్ర్తీ ధ‌నాన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో భ‌ర్త మాత్ర‌మే వాడుకునే అవ‌కాశం క‌ల్పించారు. అయితే 1937 లో హిందు మహిళలకు ఆస్తి హక్కును మొట్టమొదటి సారిగా బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ చట్టం ద్వారా చనిపోయిన భర్త ఆస్తిని భార్యకు అనుభవించే హక్కు సంక్రమింప చేశారు. ఇందులో భార్యకు కేవలం అనుభవించే హక్కు మాత్రమే కల్పించారు. ఆ ఆస్తిని అమ్మడం, కొనుగోలు చేసే హక్కును భార్యకు కల్పించలేదు. ఈ ఆస్తిని మహిళలు ఇతరులకు అమ్మాలంటే తన వారసుల పేరు మీదకో లేదా ఇతరుల పేరు మీదకో మార్చి అమ్మాలి. ఈ చట్టం ద్వారా మహిళలకు సంక్రమించే ఆస్తిలో కొన్ని హక్కులే కల్పించడం జరిగిందని ఈ చట్టసవరణ చేస్తు మరో చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. అదే హిందు వారసత్వ చట్టం 1956.

#హిందువారసత్వచట్టం-1956

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహిళా ఆస్తి హక్కు చట్టంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టం ద్వారా చనిపోయిన భర్త ఆస్తిని భార్య అనుభవించడమే కాకుండా దానిని అమ్మడానికి కూడా వీలుని కల్పించారు. ఈ చట్టం ద్వారా మహిళలు వారికి సంక్రమించిన ఆస్తిపై పూర్తి అధికారాలను ప్రసాదించినట్టైంది.

#మహిళఆస్తిహక్కు-1986

1956 చట్టాన్ని సవరణ చేస్తు ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చట్టంలో తండ్రి ఆస్తిలో కుమారులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కులను కల్పించారు. ఈ చట్టం ద్వారా ఎన్టీఆర్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపాడు అని చెప్పాలి. ఈ చట్టాన్ని 1985 సెప్టెంబర్ 5 న రూపోందించడం జరిగింది. అప్పటినుండే మహిళలకు ఆస్తిలో హక్కులను కల్పించడం జరిగింది. కాని ఈ చట్టం 1986 నుండి అమలు లోకి వచ్చింది. ఈ చట్టం చాలా బాగుందని పక్క రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇతర ప్రభుత్వాలు కూడా వారి రాష్ట్రాల్లో అమలులోకి తీసుకోచ్చారు. ఈ చట్టం ద్వారా తండ్రి ఆస్తిలో మహిళలకు పట్టుకతోనే సమాన హక్కును కల్పించారు.

#మహిళఆస్తిహక్కుచట్టం-2005

1986 ఆంద్రప్రదేశ్ లో వచ్చిన మహిళా ఆస్తి హక్కు చట్టం బాగుంది అని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసి 2005 సెప్టెంబర్ 9న యావత్ భారత దేశం మొత్తం ఈ చట్టాన్ని వర్తింపచేశారు. ఈ చట్టం భారత దేశంలో ఉన్న మహిళలకు తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటుగా సమాన వాటాను కల్పించాయి. 2004 డిసెంబర్ 20 వరకు తండ్రి తన ఆస్తిమీద ఎటువంటి వీలునామ రాయకుండా వుంటే ఆ ఆస్తిలో కొడుకుతో పాటుగా కుమార్తెలకు కూడా సమాన ఆస్తి హక్కును కల్పించారు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు ఆస్తిలో వాటా ఇవ్వని పక్షంలో మహిళలు ఆస్తిలో వాటాను కోర్టు ద్వారా పోందవచ్చు. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తే వారు చట్టరిత్యా శిక్షార్హులయ్యే విధంగా ఈ చట్టాన్ని రూపోందించారు.

*హిందూ వారసత్వ చట్టం 1956 హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 మహిళల ఆస్తి హక్కులు వాటాల గురించి దావాలు,వాదనలు,తీర్పులు*

*(1).భారతదేశంలో మహిళలు వారి ఆస్తి హక్కులు మరియు నిర్వహణ*
*(2) మహిళలకు ఆస్తిలో హక్కు ఉంటుందా, హక్కు ఉంటే ఎంత వరకు ఉంటుంది -సుప్రీంకోర్టు*
*(3) తండ్రి ఆస్తిలో కూతురు వాటా ఎంత,
*(4).తాత ఆస్తిలో కూడా వాటా వుందా లేదా!!*
*(5). పూర్వీకుల ఆస్తులు మీ వాటాను దావా వేసుకోవడం ఎలా ఆంటే!!*

*(1)భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు మరియు నిర్వహణ*

*ముస్లిమ్ లా*

*కూతుర్లు*

మహిళ పురుషుడిలో సగం అన్న భావనతో వారసత్వంలో కుమార్తె వాటా కుమారుడి వాటాలో సగంతో సమానంగా ఉంటుంది.
అయితే, ఆమె ఎల్లప్పుడూ ఈ ఆస్తి మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. దీనీని చట్టబద్ధంగా ఆమె నిర్వహించడానికి, నియంత్రణకు, మరియు విడిచి పెట్టడానికి ఆమె జీవితం కాలంలో లేదా మరణం తర్వాత హక్కు ఉంటుంది.
ముస్లిం మత చట్టం కింద ఆమె వారసత్వంగా బహుమతులు అందుకొనే అవకాశం ఉన్నప్పటికీ, బహుమతి పురుషుడి వాటాలో మూడో వంతు మాత్రమే ఉంటుంది. వంశపారంపర్య వాటాలు చాలా కఠినంగా ఉంటాయి.
కూతుర్లకు వారి వివాహం వరకు తల్లిదండ్రుల ఇళ్లలో నివాసం మరియు నిర్వహణా హక్కులు ఉంటాయి. విడాకులకు సంబంధించిన పరిస్థితులలో నిర్వహణ బాధ్యతను ఇద్దత్ కాలం (సుమారు 3 నెలల) వరకు ఆమె తల్లిదండ్రుల కుటుంబానికి ఉంటుంది. ఆమె పిల్లను కలిగి ఉండి వారికి ఆమెకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటే వారు సహాయం చేయాలి.

*భార్యలు*

ముస్లిమ్ చట్టంలో ఒక మహిళ యొక్క గుర్తింపు ఒక వ్యక్తి యొక్క స్థితి కంటే తక్కువ అయినా ఆమె వివాహానంతరం అతనిలో మాయమవదు.
అందువలన ఆమె తన వస్తువులు మరియు ఆస్తులపైన నియంత్రణ కలిగిఉంటుంది. అతని ఇతర భార్యలకు ఎలాంటి నిర్వహణ ఇస్తున్నాడో అదే ఈమెకు కూడా ఇవ్వాలి, లేకపోతె అతనికి వ్యతిరేకంగా చర్య తీసుకోవచ్చు.
సుప్రీం కోర్టు విడాకులు సందర్భంలో, ఒక ముస్లిం మతం భర్తకు విడాకులు ఇచ్చిన భార్య నిర్వహణ మరియు ఆమె భవిష్యత్తు కోసం సహేతుకమైన ఏర్పాట్లు చేసే బాధ్యతను కలిగి ఉంటాడు. అటువంటి ఒక సహేతుకమైన నిబంధన ఇద్దత్ సమయం దాటే లోపల సెక్షన్ 3 {1Ha} (ముస్లిం మత ఆడవారి విడాకుల హక్కుల రక్షణ) చట్టం, 1986 ప్రకారం భర్త బాధ్యతను స్వీకరించాలి.
పెళ్లి సమయంలో అంగీకరించిన ఒప్పందం ప్రకారం మెహర్ హక్కు కలిగి ఉంటుంది.
పిల్లలు ఉంటే ఎనిమిదవంతు ఆస్తి లేదా పిల్లలు లేకపోతే నాలుగో వంతు ఆస్తిని అతని నుండి వారసత్వంగా పొందుతుంది. అతినికి ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉంటే, వాటా పదహారవ వంతుకు తగ్గిపోతుంది. చట్టంలో సూచించిన ఎస్టేట్లో ఏ భాగస్వాములు లేకపోతే, భార్య సంకల్పంతో ఎక్కువ మొత్తంలో వారసత్వంగా తీసుకోవచ్చు. ఒక ముస్లిం తన ఆస్తిలో మూడవ వంతు వారసత్వంలో భాగస్వామి కాని వారికి ఇవ్వవచ్చు.
తల్లి
విడాకులు లేదా వైధవ్యం విషయంలో ఆమె పిల్లలు నుండి నిర్వహణ పొందగలుగుతుంది.
ఆమె ఆస్తిని ముస్లిం మత చట్టం నియమాల ప్రకారం విభజించవచ్చు.
ఆమెకు మరణించిన పిల్లల ఎస్టేటులో ఆరవవంతు వారసత్వంగా పొందే అర్హత ఉంది.

*క్రిస్టియన్ లా*

*కూతుర్లు*

ఆమె తన తండ్రి లేదా తల్లి ఎస్టేటును సోదరులకు సమానంగా పొందుతుంది.
ఆశ్రయం మరియు నిర్వహణకు వివాహానికి ముందు అర్హులు, కానీ తర్వాత కాదు.
ఆమె వ్యక్తిగత ఆస్తి మీద సంపూర్ణ హక్కులు ఆమె మేజరు అయిన తర్వాత ఉంటాయి. అప్పటి వరకు, ఆమె సహజ సంరక్షకుడుగా ఆమె తండ్రి ఉంటాడు.

*భార్యలు*

ఆమె తన భర్త నుండి నిర్వహణ పొందుతుంది. కానీ అతను దానిలో వైఫల్యమైతే విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
ఆమె భర్త మరణం తరువాత ఆమె ఆస్తిలో మూడవ వంతు వాటా ఉంటుంది, మిగిలిన ఆస్తి సమానంగా పిల్లలు పంచుకోవాలి.
ఆమె తన భర్త యొక్క ఎస్టేటు నుంచి కనీసం Rs.5000/- వారసత్వంగా ఉండాలి. ఎస్టేటు దీనికంటే ఎక్కున మొత్తాన్ని కలిగి ఉంటే. ఇది కాకాపోతె ఆమె మొత్తం వారసత్వంగా తీసుకోవచ్చు.

*తల్లులు*

ఆమెకు పిల్లల నుండి నిర్వహణ హక్కు లేదు. ఒకవేళ ఆమె పిల్లలలో ఎవరైనా భార్యా పిల్లలు లేకుండా మరణిస్తే అప్పుడు ఆమెకు ఆ ఆస్తిలో నాలుగో వంతు వారసత్వంగా ఉంటుంది.

*హిందూ మతం లా*

*కూతుర్లు*

కూతుర్లకు వారి తండ్రి ఆస్తిలో కుమారులతో సమానంగా హక్కు ఉంటుంది.
తల్లి ఆస్తిలో కూడా ఒక భాగం ఉంటుంది.
హిందూ మతం వారసత్వ (సవరణ) చట్టం, 2005 అనేది సెప్టెంబర్ 9, 2005 నుంచి అమలులోకి వచ్చింది.

సవరణ చట్టం లింగ వివక్షత నిబంధనలను తొలగించింది మరియు కుమార్తెలకు క్రింది హక్కులు కలిగించింది.
పుట్టికతోనే కుమారులతో సమానంగా ఆమె కూడా స్వంత హక్కుతో ఒక దాయాది అవుతుంది;
ఆమె కుమారునిగా జన్మించి ఉంటే ఉండేటటువంటి అన్నిదాయాది హక్కులు కుమార్తెకు ఉంటాయి.
కుమార్తెకు కుమారునికి ఉన్న దాయాది అర్హత ఉంటుంది.
కుమార్తెకు కుమారుడికి కేటాయించిన వాటా లాగే కేటాయించాలి.
వివాహిత కుమార్తెకు ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయ హక్కు, లేదా నిర్వహణా హక్కు ఉండదు. అయితే ఒక వివాహిత కుమార్తె విడాకులు లేదా భర్తను కోల్పోయినప్పుడు నివాస హక్కు ఉంటుంది.
ఒక మహిళ ఆమె ఆర్జించింది లేదా బహూమతి ఇచ్చిన లేదా వీలునామా చేయ్యబడిన ఆస్తిపైన సంపూర్ణ హక్కులు ఆమెకు యుక్తవయసు రాగానే అందుతాయి. ఆమె సరియైనది అనుకుంటే దానిని అమ్మవచ్చు, బహుమతి ఇవ్వవచ్చు లేదా విల్లు రాయవచ్చు.

*భార్యలు*

ఒక వివాహిత స్త్రీ తన వ్యక్తిగత ఆస్తి మీద పూర్తి హక్కును కలిగి ఉంటుంది. ఆమె దానిలోని కొంత భాగం గానీ లేదా పూర్తిగా ఎవరికైనా బహుమతిగా ఇస్తే తప్ప. ఆమె సంపాదించింది అయినా సంక్రమించినది అయినా లేదా బహుమతి పొందిందైనా ఆమె పూర్తి యజమానురాలు.
ఆమె భర్త నుండి నిర్వహణ, ఉమ్మడి కుటుంబానికి చెందినది అయితే కుటుంబం నుండి మద్దతు మరియు ఆశ్రయ హక్కు కలిగి ఉంటుంది.
ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజనలో తన భర్త మరియు అతని కుమారులు మధ్య, ఆమె ఇతరులలాగా సమాన వాటా పొందుతుంది. అదేవిధంగా, ఆమె భర్త చనిపోయినప్పుడు, ఆమె తన భాగాన్ని ఆమె పిల్లలు మరియు అతని తల్లితో మమానంగా ఉంటుంది.

*తల్లులు*

ఆమె ఎవరిపైనా ఆధారపడి లేని తన పిల్లలు నుండి నిర్వహణ పొందవచ్చు. ఆమె మొదటి తరగతి వారసురాలు కూడా.
భర్తను కోల్పోయిన తల్లి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో విభజన కుమారులు మధ్య జరిగినప్పుడు పుత్రుడి వాటాతో సమానంగా వాటా తీసుకోనే హక్కును కలిగి ఉంటుంది.
ఆమె స్వంతమైన అన్ని ఆస్తులను అమ్మవచ్చు, బహుమతిగా ఇవ్వవచ్చు లేదా విల్లు రాయవచ్చు.
ఆమె విల్లు వ్రాయకుండా మరణించినప్పుడు, ఆమె పిల్లలు సెక్స్ (లింగ) సంబంధంలేకుండా , సమానంగా వారసత్వంకలిగి ఉంటారు.

*నిర్వహణ*

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రుల నిర్వహణ సూచిస్తుంది.

వ్యక్తి నిర్లక్ష్యం వహిస్తే లేదా పోషణను తిరస్కరించినట్లైతే
అతని భార్య తనకు తాను పోషించుకోలేక పోతే లేదా
అతనికి చట్టబద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన చిన్న పిల్లల కలిగి ఉంటే,
అతని తండ్రి లేదా తల్లి, తనను తాను నిర్వహించుకోలేక పోతే
అలాంటి సందర్భాలలో కోర్టు భార్య పిల్లలు లేదా తల్లిదండ్రుల నిర్వహణ కోసం నెలసరి భత్యం ఇవ్వాలని అలాంటి వ్యక్తికి ఆదేశించవచ్చు.
మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఆర్డర్ జారీ
మేజిస్ట్రేట్ అదాలత్లు కొనసాగే క్రమంలో మధ్యంతర నిర్వహణ కోసం నెలసరి భత్యం ఆర్డరు ఇవ్వవచ్చు.
మధ్యంతర నిర్వహణ మరియు కొనసాగే ఖర్చుల నెలవారీ భత్యం కోసం వీలైనంత వరకూ అప్లికేషన్ యొక్క నోటీసు తేదీ నుంచి అరవై రోజుల్లో పరిష్కరించుకోవాలి.
భర్త నుండి విడాకులు తీసుకున్న లేదా ఇచ్చి తిరిగి పెళ్లి చేసుకోకపోతే "భార్య" అంటారు.

*(2)ముఖ్యమైన జ్యుడీషియల్ తీర్మానాలు*

*మంగత్ మూల్ వి. పున్ని దేవి (1995) (5) 199 ఎస్సీ స్కేల్*

నివాసానికి సంబంధించి తప్పనిసరిగా నిర్వహణా నియమం ఉండాలి. స్త్రీ ఆమె అలవాటు పడిన దానకంటే ఎక్కువ లేదా తక్కువ పద్ధతిలో జీవించటానికి నిర్వహణ ఇవ్వబడుతుంది. నిర్వహణలో ఆహారం, బట్టలు, మరియు అటువంటివాటితోపాటు ప్రాథమిక ఇంటి అవసరం కలిగి ఉంటాయి.

*Sh. రాజేష్ చౌదరి వర్సెస్ నిర్మలా చౌదరి 1385/2004*

ఢిల్లీ హైకోర్టు
ఈ సందర్భంలో వ్యక్తి ఆడ శిశువు యొక్క పితృత్వాన్ని నిర్ధారించేందుకు అనుమతి కోరుతూ పిటిషను వేసాడు. అతను ఆరోపణలు రూఢీ పరచడానికి DNA పరీక్ష ద్వారా బాలిక పితృత్వాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. పాప అధర్మం ఆరోపణపై DNA పరీక్ష నిర్ణయం ఒక క్లిష్టమైన సమస్య. ఇలాంటి సమయంలో విడిపోయిన భార్య తన్నుతాను మరియు పిల్లల కోసం మధ్యంతర నిర్వహణను ఖండించవచ్చా లేక అంగీకరించాలా అనేది సమస్య.

రక్త గ్రూపు పరీక్ష వివాదాస్పద పితృత్వాన్ని గుర్తించడానికి ఒక ఉపయోగకరమైన పరీక్ష అని పేర్కొంది. కోర్టులు దీనిని సర్కంస్టాంషిల్ సాక్ష్యంగా తీసుకొని సంతానం యొక్క తండ్రిగా ఒక వ్యక్తిని మినహాయించవచ్చు. అయితే, ఏ వ్యక్తి అతని/ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా విశ్లేషణ కోసం రక్తం నమూనాను ఇవ్వాలని ఒత్తిడి చేయలేము మరియు అలా ఒప్పుకోవి వారిపై ఎలాంటి చర్య తీసుకోవడానికి వీలు ఉండదు. భారతదేశం లోని కోర్టులు రక్త పరీక్షపై మాత్రమే ఆధారపడి ఉండవు. పితృత్వ రుజువు విచారణ ప్రార్థన అప్లికేషన్లలో ప్రతిదానికి రక్త పరీక్ష చేయటాన్ని ప్రోత్సహించదు.

వివాహం వేడుకలు మరియు ప్రతి వ్యక్తి సక్రమమైన వాల్లుగా చట్టం భావిస్తుంది. వివాహం లేదా సంతతి (తల్లిదండ్రులు) ఊహించుకోవచ్చు. చట్టం మోసం మరియు అనైతికత ఇందులో ఉంటుందిని ఊహించుకోదు. కోర్టు రక్త పరీక్షకు ఆదేశాలిస్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయో జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ఆదేశం వలన ఒక పవిత్ర స్త్రీ కి చెడ్డ పేరు రావచ్చు మరియు శిశువుకు మానసికంగా పడే ప్రభావాన్ని దాని ఫలితాలను కూడా పరీక్షించవలసి ఉంటుంది. "శిశువు మరియు తన తల్లి, పిటిషనర్ భార్య, జీవనోపాధి భరణానికి సంబంధించిన , అధర్మ ఆరోపణ నిర్ణయం వచ్చేవరకు ఎదురుచూడకూడదు మరియు భరణం, చెల్లించవలసి ఉంటే, వేగంగా అందేలా ఆదేశించాలి".

*శ్రీమతి. B.P. అచల ఆనంద్ - 2000 సివిల్ అప్పీల్ నంబర్ 4250*

ఈ కేసులో సుప్రీం కోర్టు వ్యక్తిగత చట్టాల్లో వివాహ ఇంటిలో భార్య నివసించటం ఆమె హక్కు అని చెప్పింది. భర్త తన భార్యను పోషించాలి. ఆమె అతని ఇంట్లో మరియు రక్షణ కింద ఉండే హక్కు ఉంది. భర్త ప్రవర్తన కారణంగా లేదా ఇంట్లో ఉంచుకోక పోయినా లేదా ఆమెను చూడడానికి నిరాకరించినా ఆమె అతని నుండి దూరంగా జీవించే హక్కు కలిగి ఉంటుంది. నివాస హక్కు భార్య నిర్వహణలో భాగం. నిర్వహణ కోసం భార్య అనే పదం విడాకులు తీసుకున్నామెకు కూడా వర్తిస్తుంది.

*భారత్ హెవీ ప్లేట్లు మరియు వెసల్ లిమిటెడ్, AIR 1985 ఆంధ్ర ప్రదేశ్ 207*

భర్త ఒక కంపెనీలో ఉద్యోగి. అతను తన భార్యతో నివసించేందుకు కంపెనీ క్వార్టర్ కేటాయించింది. క్వార్టర్ వివాహ నివాసంగా ఉంది. అయితే, వ్యత్యాసాలు వచ్చి వారు విడిపోయారు. భర్త కంపెనీ క్వార్టర్ వదిలి పోయాడు. అతని భార్య మరియు చిన్న పిల్లల మాత్రమే అందులో ఉన్నారు. భర్త తన లీజు రద్దు చేయమని కంపెనీకి రాశారు. వారు ఆమెను ఖాలీ చేయించె అవకాశాలు ఉన్నప్పుడు తనను మరియు తన ముగ్గురు మైనర్ పిల్లలను ఖాళీ చేయించకుండా నిరోధక నిషేధాజ్ఞను కోరుతూ, రక్షణ కోసం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు భార్య మరియు ఆమె చిన్న పిల్లలను కంపెనీ ఖాళీ చేయించడాన్ని ఖండించింది. భర్త భార్య మరియు పిల్లలకు ఆశ్రయం అందించే బాధ్యత కలిగి ఉంటాడు. అందువల్ల క్వార్టరు అద్దె మొత్తం భర్త జీతం నుండి ఇవ్వబడింది.

*(3).ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుందా,ఉంటే ఎంత?సుప్రీంకోర్టు*

ఎన్‌.టీ.ఆర్‌ బిల్లు ఆడపడుచులకు జరుగుతున్న అన్యాయాల్ని తొలగించటానికి ఉద్దేశించిన చట్టం
ఎంతోమంది
ఉమ్మడి ఆస్తిలో మగవారితో పాటు… మహిళలకూ హక్కు ఉంటుందా? ఈ ప్రశ్న ఎంతో మందిని వేధిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్నో ధర్మాలు, చట్టాలు… కోర్టు తీర్పులు… మరి అవన్నీ ఏం చెబుతున్నాయి? మహిళలకు ఏయే పరిస్థితుల్లో ఆస్తిపై హక్కులు సంక్రమిస్తాయి? కొత్తగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది. తెలుసుకుందాం!

సాయిరెడ్డి ఉమ్మడి ఆస్తి విభజన కోసం తన అన్నదమ్ములపై స్థానిక కోర్టులో 1973లో దావా వేశాడు. ప్రాథమిక డిక్రీ పొందాడు. ఆ డిక్రీని హైకోర్టు ఖాయపర్చింది. ప్రాథమిక డిక్రీ ప్రకారం ఎవరికి వాటాలున్నాయి, ఎంత వాటా అనేది నిర్ణయం జరిగింది. దాని ప్రకారం ఆస్తుల్ని హద్దుల్తో విడగొట్టి స్వాధీనం చెయ్యాల్సిందిగా కోరుతూ తుది డిక్రీ కోసం అర్జీ పెట్టుకున్నాడు. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ బిల్లు అమల్లోకి వచ్చింది. సాయి రెడ్డి ఆడపడుచులు తమకూ వాటాలు వస్తాయని, మళ్లీ వాటాల పునః నిర్ణయం చేయాలనీ కోరారు. వారి అభ్యర్థనను స్థానిక కోర్టు తోసి పుచ్చింది. హైకోర్టు కొత్త చట్టం ప్రకారం వారికీ వాటా ఉందని, ఆ చట్ట ప్రకారం తిరిగి వాటాలను నిర్దేశించమని ఆదేశించింది. ఈ ఆదేశాల్ని సాయి రెడ్డి సుప్రీం కోర్టులో సవాలు చేశాడు.

సుప్రీం కోర్టు… ఎన్‌టీఆర్‌ బిల్లు ఆడపడుచులకు జరుగుతున్న అన్యాయాల్ని తొలగించటానికి ఉద్దేశించిన చట్టం కాబట్టి, అది అమల్లోకి వచ్చిన 5-9-1985 నాటికి, తుది విభజన జరగనందున కొత్త చట్టం ప్రకారం వాటాలను పునః నిర్ణయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.

చాకిరి యానాది తండ్రిపైనా, సోదరుని పైనా ఆస్తి విభజనకు దావా వేశాడు. 1999లో ఆ దావాలో ప్రాథమిక డిక్రీ జారీ చేశారు. తుది డిక్రీ కోసం అర్జీ పెట్టుకున్నారు. ఈ దశలో పార్లమెంటు 2005లో చేసిన హిందూ వారసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. యానాది ఆడపడుచులు, తమకు కొత్త చట్టం ప్రకారం హక్కు వస్తుందని అర్జీ పెట్టుకున్నారు. స్థానిక కోర్టు ఆ అర్జీని ఆమోదిస్తూ తిరిగి వాటాలను నిర్ణయించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై యానాది హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు అతని వాదాన్ని అంగీకరించి, కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. ఆడపడుచులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సాయిరెడ్డి కేసులో చెప్పిన న్యాయసూత్రాలు ఈ కేసుకి, 2005 చట్టానికి కూడా వర్తిస్తాయని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. రిజిష్టర్డు పారికత్తులు (విభజన పత్రం) లేదా కోర్టు తుది విభజన తీర్పులుంటే తప్ప ఇతర అన్ని సందర్భాల్లోనూ ఆడపడుచులకు సవరణ చట్టం ప్రకారం హక్కులుంటాయని చాకిరి యానాది కేసులో తీర్పు చెప్పారు.

పై తీర్పులు, ఇంకా అనేక సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులు ఆడపడుచుల హక్కులు కొత్త చట్టం ప్రకారం మాత్రమే నిర్ణయం అవుతాయనే వాదాన్ని బలపర్చాయి.

*కొత్త తీర్పులో ఇలా!*

ఇప్పటి వరకూ ఉన్న 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం గురించి ఉన్న తీర్పులకు భిన్నంగా ఈ సంవత్సరం అక్టోబరు 16న పూలవతి కేసులో కొత్త తీర్పు వెలువడింది. గత తీర్పులేవీ సవరణ చట్టం అమలు గతం నుంచా? కాదా అన్న విషయాన్ని నిర్ణయించలేదని అభిప్రాయపడింది.

పూలవతి తండ్రి ఆస్తుల్లో వాటాకోసం కేసు వేసి, సవరణ చట్టం తర్వాత సోదరులతో సమానమైన హక్కు రావాలని, తన దావాను సవరించుకుంది. స్థానిక కోర్టు ఆమెకు ఉమ్మడి ఆస్తుల్లో తండ్రి వాటాను లెక్కించి, అందులో ఆమెకో వాటా వస్తుందని తీర్పు ఇచ్చింది. హైకోర్టును ఆశ్రయించగా సవరణ చట్టం ప్రకారం ఆమెకు సోదరులతో సమానమైన వాటా ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సవరణ చట్టం వర్తించాలంటే అమలు తేదీ నాటికి అంటే 9-9-2005 నాటికి తండ్రి జీవించి ఉండాలనీ, అలాగే సవరణ చట్టం నాటికి జీవించి ఉన్న కూతుళ్లకు మాత్రమే ఈ చట్టం ప్రయోజనం కలుగుతుందని తీర్పు చెప్పింది. అంటే 9-9-2005 నాటికి తండ్రి చనిపోయి ఉంటే సవరణ చట్టం కింద కుమార్తెలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ తీర్పు ప్రకారం 9-9-2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా… అతని కూతుళ్లలో ఎవరైనా చనిపోతే అమె వారసులకు ఎలాంటి హక్కులు రావు. ఉదాహరణకు… తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరు 9-9-2005 నాటికి చనిపోయారనుకుందాం. ఈ సందర్భంలో జీవించి ఉన్న కుమార్తెకే అన్ని హక్కులు సంక్రమిస్తాయి. మరణించిన కుమార్తె పిల్లలకు ఎలాంటి హక్కులూ ఉండవన్నమాట.

అలాగే, తండ్రి ఒక రోజు ముందు అంటే 8-9-2005 నాడు చనిపోయాడు. అలాంటపుడు కూతుళ్లకు కొత్త చట్టం కింద హక్కులు రానట్లే. చట్టం ఉద్దేశం ఇది కాదు. ఎందుకంటే సవరణ చట్టాన్ని పరిశీలిస్తే కుమార్తె చనిపోయినా ఆమె పిల్లలకూ… ఆ పిల్లల్లో ఎవరైనా చనిపోతే వారి పిల్లలకు కూడా సవరణ చట్టం హక్కులు కల్పిస్తోంది.

ఈ తీర్పుతో వచ్చిన చిక్కేమిటంటే… గతంలో చెప్పిన తీర్పులన్నీ న్యాయబద్ధమైనవే అంటూ ఆ తీర్పుల్లో, సవరణ చట్టం వర్తింపునకు సంబంధించిన అంశం లేదని అభిప్రాయపడింది. ఈ తీర్పు ఇచ్చింది ద్విసభ్య ధర్మాసనం. కాబట్టి, గత తీర్పులను సమీక్షించే అధికారం ఆ ధర్మాసనానికి లేదు. పైగా సాయిరెడ్డి కేసులో ఎన్‌టీఆర్‌ బిల్లు రీత్యా అవివాహిత కుమార్తెల హక్కుల్ని కోర్టు ఖాయపర్చిందని అభిప్రాయపడింది. కానీ, సాయిరెడ్డి తీర్పును సుప్రీం కోర్టు యానాది, నంజె గౌడ కేసుల్లో సవరణ చట్టానికి కూడా అన్వయించింది. పైగా యానాది కేసులో సవరణ చట్టంలో మినహాయించిన సందర్భాల్లో తప్ప కుమార్తెలకు సవరణ చట్టం ప్రకారం వాటా హక్కులు సంపూర్ణంగా సంక్రమిస్తాయని పేర్కొంది.

ఎన్‌టీఆర్‌ బిల్లును మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరించాయి. అయితే, దేశమంతా మహిళలకు ఈ ప్రయోజనాల్ని కల్పించాలని లా కమిషన్‌ చేసిన సూచనల మేరకు 2005లో పార్లమెంటు ప్రస్తుత సవరణ చట్టాన్ని తెచ్చింది. దానిలోని ప్రధానమైన అంశాలు ఏమిటంటే…

9-9-2005న సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి హిందూ అవిభక్త కుటుంబంలోని భాగస్వామి లేదా వాటాదారు కుమార్తె, కొడుకులాగానే జన్మతః భాగస్వామి/వాటాదారు అవుతుంది. కుమారుడికి ఉన్న సర్వ హక్కులు ఆమెకూ ఉంటాయి. అదే విధంగా బాధ్యతలు కూడా.

ఈ హక్కుల వల్ల 2004 డిసెంబరు 20 తేదీ నాటికి జరిగి పోయిన అన్యాక్రాంతాలు కూడా అంటే, క్రయం, దానం, తనఖా వగైరా కానీ, విభజనలు కానీ ప్రభావితం కావు. విభజన అంటే పై తేదీ నాటికి రిజిష్టర్డు దస్తావేజుకానీ, కోర్టు డిక్రీ ద్వారాగానీ జరిగి ఉండాలి. సాయిరెడ్డి కేసు తీర్పు ప్రకారం, ఆ విభజన తుది విభజన అయి ఉండాలి.

ఈ వాటా, హక్కులు, ఉమ్మడి భాగస్వామ్యపు లక్షణాల్ని, పరిమాణాల్ని కల్గి ఉంటాయి. విల్లు ద్వారా దత్తత చేయవచ్చు.

ఎవరైనా హిందూ పురుషుడు చనిపోతే, ఉమ్మడి ఆస్తిలో అతనికి రావాల్సిన వాటా, వారసత్వంగా అతని వారసులకు చెందాలి తప్ప, కేవలం మిగిలిన మగవారికి కాదు. కొడుకుతో సమానమైన వాటా కూతురికి చెందాలి. ఒకవేళ ఎవరైనా చనిపోతే వారికి రావాల్సిన వాటా వారి వారి వారసులకు చెందాలి. ఆ వారసుల్లో ఎవరైనా ముందే చనిపోయి ఉంటే వారికి రావాల్సిన వాటా వారి పిల్లలకు సంక్రమిస్తుంది.

పితృరుణం తీర్చాల్సిన ధర్మ సూత్రం ప్రకారం రుణదాతకు బాకీదారు కొడుకు, మనుమడు, మునిమనుమలపై ఉన్న హక్కులు రద్దు అవుతాయి. 9-9-2005 నుంచి అలాంటి హక్కుల్ని ఏ కోర్టు గుర్తించరాదు. అమలు చేయరాదు. దీని వల్ల ఆడపడుచులకు రావాల్సిన వాటాను ఇలాంటి బాధ్యతల నుంచి కూడా కాపాడారు.

*పై అంశాల్ని పరిశీలిస్తే, ఈ కింది విషయాలు స్పష్టం అవుతాయి.*

ఉమ్మడి కుటుంబంలో ఆడపడుచులకు, కొడుకులతో సమానమైన జన్మతః వాటా.
తండ్రి విల్లు లేకుండా చనిపోతే, ఉమ్మడి ఆస్తిలో అతనికి రావాల్సిన వాటాలో కూతురికి, కొడుకుతో సమానమైన వాటా.
పైన కల్పించిన జన్మతః హక్కుల్ని, దొంగ పత్రాలతోనూ, రుణాలతోనూ హరించకుండా, భద్రతా ఏర్పాట్లు.
చట్టంలో ఉమ్మడి ఆస్తి హక్కులకీ, తండ్రి వాటాలో హక్కులకీ చాలా విస్పష్టమైన తేడా ఉంది. అయితే, తాజా తీర్పులో ఈ తేడాని గుర్తించినట్లు కనపడదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల వరకూ కూతురు హక్కులు ఏమిటి?అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రస్తుత చట్టాలు…

*గతంలో తీర్పులన్నీ పరిగణనలోనికి తీసుకుంటే…*

1956 చట్టం, 2005 సవరణ చట్ట ప్రకారం తండ్రి స్వార్జితంతోపాటు ఉమ్మడి ఆస్తిలోని తండ్రికి రావాల్సిన వాటాలోనూ, కొడుకుతో సమానమైన వారసత్వపు హక్కులు.
1956 చట్టం, 1985 రాష్ట్ర సవరణ చట్టం ప్రకారం 5-9-1985 నుంచి ఉమ్మడి ఆస్తిలో అవివాహిత కుమార్తెలకు కొడుకుతో సమానమైన వాటా హక్కులు.
2005 సవరణ చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తిలో (20-12-2004 నాటికి అన్యాక్రాంతం, రిజిష్టర్డు విభజన, విల్లు లేని పక్షంలో) 9-9-2005 నుంచి కొడుకుతో సమానమైన వాటా హక్కులు, భాగస్వామ్య హోదా.
కొత్త తీర్పు ప్రకారం 5-9-85 నాటికి వివాహితులైన కుమార్తెల విషయంలో వారు 9-9-2005 నాటికి జీవించి ఉండి, వారి తండ్రి కూడా జీవించి ఉంటే 2005 సవరణ చట్టం కింద జన్మతః వాటా హక్కులు వస్తాయి. లేకపోతే రావు. అయితే, ఎన్‌టీఆర్‌ బిల్లు ప్రకారం వాటా పొందిన వారికి ఈ తీర్పు వల్ల ఏమీ తేడా రాదు. కానీ, గత తీర్పులు కూడా అమల్లోనే ఉన్నాయని, వాటిపై ఈ కొత్త తీర్పు ప్రభావం ఉండదని కూడా మనం గమనించాలి. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
సవరణలు ఎన్నో…

కోర్టు తీర్పుల్లో ఉన్న లోతుల్ని అర్థం చేసుకోవాలంటే… మనం చట్టాన్ని, చట్టంలోని అంశాలను… సవరణ క్రమాన్ని పరిశీలించాలి. హిందూ సనాతర ఆచారాల ప్రకారం కుటుంబంలోని మహిళలకు ఉమ్మడి ఆస్తిలో హక్కు లేదు. కేవలం సామాజిక, ఆర్థిక స్థాయిని బట్టి భరణం హక్కులు మాత్రమే లభిస్తాయి.

ఉమ్మడి కుటుంబంలోని మగవారికి, అంటే కుటుంబ పెద్ద నుంచి నాలుగు తరాల మగ సంతతికి మాత్రమే ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కులుంటాయి. ఈ హక్కులు జన్మతః సిద్ధిస్తాయి. అవి ఉమ్మడి కుటుంబ ఖర్చు, బాధ్యతలు రుణాలకు లోబడి ఉంటాయి.

ఉమ్మడి కుటుంబంలో విభజన జరిగే వరకూ ఎవరికి ఎంత వాటానో తేల్చి చెప్పలేం. ఎందుకంటే, కుటుంబంలో జనన మరణాలు, దత్తతలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.

ఎవరైనా చనిపోతే కుటుంబంలోని మిగిలిన మగ వారికి భాగస్వాములుగా ఆస్తి చెందుతుంది తప్ప, చనిపోయిన వారి వారసులకు వారసత్వంగా కాదు. ఎవరికీ విల్లు రాసుకునే హక్కులు కూడా లేవు.

ఈ రకమైన సనాతన ఆచారాలను కాలానుగుణంగా సవరణలు చేస్తూ శాసనాలను రూపొందించారు. 1-9-1870 తర్వాత బెంగాల్‌, మద్రాస్‌, బొంబాయి ప్రాంతాల్లో హిందువులకు విల్లు హక్కులు కల్పించడం. ఇది చాలా విప్లవాత్మకం. ఆడపిల్లల తండ్రి, తన కూతుళ్లకు విల్లు రాయొచ్చు.

హిందూ వితంతువులకు, భర్త ఆస్తిలో జీవితాంతపు అనుభవ హక్కులు 1937 నుంచి కల్పించారు. 1946లో వివాహిత స్త్రీలకు కొన్ని సందర్భాల్లో వేరు నివాస హక్కులు కల్పించారు.
1956లో స్త్రీలకు గతంలో కల్పించిన అనుభవ హక్కుల్ని సంపూర్ణ హక్కులుగా మార్చారు. దీంతోపాటు ఉమ్మడి ఆస్తిలో చనిపోయిన తండ్రి వాటా కుటుంబంలోని మగ సంతతికి మాత్రమే దత్తం కాకుండా స్త్రీ వారసులుంటే వారికీ, మగ వారసులతో పాటు సమాన హక్కులు కల్పించడం. పునర్‌ వివాహం వల్ల హక్కులు పోకుండా కాపాడటం. సంపూర్ణ విల్లు హక్కులు కల్పించారు. అయితే, ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కులు లేవు.

ఈ లోపాన్ని ఆంధ్రప్రదేశ్‌ వరకూ 5-9-1985 నాటి అవివాహితులైన ఆడపడుచులందరికీ కొడుకుతో సమానంగా, జన్మతః ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కుల్ని కల్పించి, సవరించారు. దీన్ని ఎన్‌టీఆర్‌ బిల్లుగా వ్యవహరిస్తారు. ఈ చట్ట ప్రకారం, కుమార్తెలకు కొడుకుతో సమానమైన వాటా హక్కుల్ని కల్పించారు. ఆమె ఉమ్మడి ఆస్తిలో భాగస్వామి/వాటాదారు. ఒకవేళ ఎవరైనా కొడుకుగాని, కూతురుగానీ చనిపోయి ఉంటే వారి పిల్లలకు ఈ వాటా చెందుతుంది. చట్టానికి పూర్వమే పెళ్లెన కుమార్తెకానీ, ముందే జరిగిపోయిన విభజనకు కానీ ఈ చట్టం వర్తించదు. సాయి రెడ్డి కేసులో సుప్రీం కోర్టు దొంగ విభజనలు, పత్రాలపై అప్రమత్తం చేసింది.

*(4).తండ్రి ఆస్తిలో కూతురు వాటా ఎంత,తాత ఆస్తిలోఆమెకు హక్కుందా లేదా?*

*తాత-తండ్రుల ఆస్తిలో హక్కు ఎవరికి ఎంత ఉంటుందంటే.*

ఆస్తి మీ తండ్రిదో, తాతదో అయినపుడు దానిపై మీకు మాత్రమే హక్కుండాలా? ఒకవేళ అలా అనుకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఎదురు కావొచ్చు.

ఎందుకంటే తండ్రి, తాత ఆస్తి పంపకంలో చాలా రకాల నియమాలు-చట్టాలు ఉన్నాయి.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో తీర్పు ఇస్తూ, తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకే దక్కదని చెప్పింది.

ఆ వ్యక్తి తల్లి ఇంకా బతికే ఉన్నపుడు ఆ తల్లికి, కూతురికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని వివరించింది.

*ఇంతకూ కేసు ఏంటి*

దిల్లీలో నివసించే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరిగాయి.

చట్టప్రకారం ఆయన ఆస్తిలో సగ భాగం ఆయన భార్యకు దక్కాలి. మిగతా సగభాగం ఆయన పిల్లలు ( ఒక అబ్బాయి, ఒక అమ్మాయి)కి దక్కాలి.

కానీ కూతురు.. తండ్రి ఆస్తిలో తన భాగం అడిగినప్పుడు, సోదరుడు ఆమె వాటా ఇవ్వడానికి నిరాకరించారు.

దాంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తల్లి కూడా కూతురివైపే నిలిచారు..

*తాత-తండ్రుల ఆస్తిలో హక్కు ఎవరికి ఎంత?*

కేసు విచారించిన దిల్లీ హైకోర్టు హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఈ విధంగా తీర్పు ఇచ్చింది.

మృతుడి భార్య ఇంకా సజీవంగా ఉన్నారు కాబట్టి ఆమెకు, కూతురికి కూడా ఆస్తిపై సమాన హక్కు ఉంటుదని న్యాయస్థానం పేర్కొంది.

దీనితోపాటు ఈ కేసు వల్ల తల్లి ఆర్థికంగా నష్టపోయిందని, మానసిక ఒత్తిడికి గురైందని భావించిన న్యాయస్థానం కుమారుడికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

*తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు*

సాధారణంగా మన సమాజంలో కుమారుణ్ని తండ్రి వారసునిగ

Address

Hyderabad
500082

Telephone

+919059966133

Website

Alerts

Be the first to know and let us send you an email when GaddamGireesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to GaddamGireesh:

Share

Category