25/02/2026
దేశవ్యాప్తంగా రేపటి నుండి "జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు ప్రారంభం.
అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు అహుడా చైర్మన్ టి సి వరుణ్ గారి ఆధ్వర్యంలో, అనంతపురం పార్లమెంటు ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రారంభ సభ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంటు ఉద్యమి సభ్యత్వ నమోదు సమన్వయకర్త డాక్టర్ హరిప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు,రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సభను ఉద్దేశించి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది రెడ్డివారి జయరాం రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు మండల అధ్యక్షులు జనసేన వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
#రైతేరాజు
#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.